దుర్గా ష్టమిపాట /2020
నిర్వహణ యేరువ ఇందిరా రెడ్డి వీరా గుడిపల్లి శివునూరి లలితాకృష్ణ ******************** కవివరుల జాబితా 1.కోరాడ గారు 2.కొప్పుల ప్రసాద్ గారు 3.తులసి వెంకట రమణాచార్యులు గారు 4.శ్రీలక్ష్మి గారు 5.యేరువ ఇందిరా రెడ్డి గారు 6.మన్నె లలిత గారు 7.భాగ్య లక్ష్మి గారు 8.మిట్టా లక్ష్మి గారు 9.సునంద వురిమిళ్ళ గారు 10.మర్రి జయశ్రీ గారు 11.డా.బల్లూరి ఉమాదేవి గారు 12.అయిత అనిత గారు 13.వల్లాల విజయ లక్ష్మి గారు 14.పిన్నక నాగేశ్వరరావు గారు *********---- 1 అంశం:- (గీతరచన) కోరాడ నరసింహా రావు,! ******************* సాకీ:-అమ్మా...దుర్గమ్మా కరుణించి...మము బ్రోవగ రావమ్మా.....! పల్లవి:- జయ జయ జననీ .... దుర్గా భవాని...వినుతిని గొనుమా, విజయము నిమ్మా.....! "జయ జయ జననీ" చరణం:- జగముల నేలగ...చల్లని తల్లీ....,నవరూపములనుధరియించి...అసురుని జంపగ...విజయ దుర్గ వై....నీ భీకర రూపము జూపితివమ్మా ....! "జయ జయ జనని" చరణం:- వింత-వింత రోగాలు... ప్రక్రుతిదాల్చినవికృతులు నేటి మనిషి బ్రతుకును... చేస్తున్నవి అతలా కుతలం....! ఈదుష్ఠశక్తులనుఅణచగ నీవు...యే అవతారము నెత్తె...